‘అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’

by  |

దిశ, వరంగల్: కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనగామ టౌన్ సీఐ మల్లేష్ యాదవ్ హెచ్చరించారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దనీ, అలాంటి వార్తలపై వెంటనే సమాచారమివ్వాలని సూచించారు. జనగామ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని వెల్లడించారు.

Tags: corona, virsu, wrong propaganda, strict actions, janagama, CI Mallesh yadav



Next Story

Most Viewed