వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది : ఎమ్మెల్సీ కవిత

by  |
వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, ముషీరాబాద్: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.3,016ల పెన్షన్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు కేవలం రూ.500 పెన్షన్ ఇచ్చేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.1500, రెండోసారి రూ.3016 కు పెంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,98,565 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు.

Next Story

Most Viewed