దృశ్యం దర్శకుడికి రాజమౌళి కితాబు

by  |
rajamouli appreciated dorector jeethu joseph
X

దిశ, సినిమా : ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా అద్భుత విజయాన్ని దక్కించుకోగా, సినీప్రముఖులు జీతూ జోసెఫ్‌ డైరెక్షన్ స్కిల్స్‌ను ప్రశంసిస్తున్నారు. రీసెంట్‌గా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వాట్సాప్ వేదికగా దర్శకుడు జీతూ జోసెఫ్‌తో పంచుకున్నాడు. ఈ విషయాన్ని జీతూ స్వయంగా వెల్లడించడం విశేషం.

‘హాయ్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. కొన్ని రోజుల క్రితం దృశ్యం 2 సినిమా చూశాను. అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా చూశాక నా ఆలోచ‌న‌లన్నీ ఆ సినిమా చుట్టే తిరిగాయి. వెంటనే మరోసారి మలయాళ దృశ్యం చూశాను(అంతకుముందు తెలుగులో విడుదలైనప్పుడే చూశాను). డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా ప్రతీ విభాగం అద్భుతం. ప్రధానంగా రైటింగ్ స్టైల్ చాలా గొప్పగా ఉంది. ఇది వరల్డ్ స్టాండర్డ్ సినిమా. దృశ్యం ఓ మాస్టర్ పీస్. అదే ఉత్కంఠ, అంతే గ్రిప్పింగ్‌గా ‘దృశ్యం- 2’ సినిమాను తెరకెక్కించడం నిజంగా గొప్ప విషయం. మీ నుంచి ఇలాంటి మరెన్నో మాస్టర్ పీస్ సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నాను’ అని జీతూకు డైరెక్టర్ రాజమౌళి మెసేజ్ చేశారు. ఈ మేరకు రాజమౌళి ప్రశంసను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్న జీతు.. ఈ సందర్భంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘ఐ యామ్ హానర్డ్’ అని పేర్కొన్నాడు. కాగా, ‘దృశ్యం 2’ చిత్రాన్ని హీరో వెంక‌టేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Next Story