అలిపిరి మెట్లపై బిక్షగాడి అవతారం.. 15 ఏళ్ల కింద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

by  |
అలిపిరి మెట్లపై బిక్షగాడి అవతారం.. 15 ఏళ్ల కింద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని అలిపిరి మెట్లపై బిక్షగాడి అవతారంలో సంచరిస్తున్న ఓ మోసగాడిని కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని కోసం15 ఏళ్లుగా గాలిస్తున్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. వివరాల్లోకివెళితే.. జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై గతంలో 40 కేసుల్లో కీలక నిందితుడు. ఈయన పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఎవరి కంట పడకుండా ఉండేందుకే ఏపీలోని తిరుపతి నడకదారి అలిపిరి మెట్ల వద్ద వేషం మార్చుకుని బిక్షగాడి అవతారమెత్తినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా తరహాలో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్ ఉన్నత కుటుంబంలో జన్మించాడని సమాచారం. జల్సాలకు అలవాటు పడి ఇతను పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed