బాడ్మింటన్‌లో శ్రీకాంత్ సంచలనం.. భారత్‌కు పతకం ఖాయం..!

by  |
Srikanth
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ బారత బ్యాడ్మెంటన్ క్రీడాకారుడు సాధించని ఫీట్‌ను శ్రీకాంత్ అందకున్నాడు. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరిన మొద్దమొదటి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. ప్రీఫైనల్‌లో ఆరోస్థానంలో ఉన్న లక్ష్య సేన్‌ను 17-21, 21-14, 21-17 తో మట్టి కరిపించి శ్రీకాంత్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మొదటి గేమ్ సెట్‌లో శ్రీకాంత్ ఓటమిని చవిచూసినప్పటికీ, తరువాత రెండు గేమ్ సెట్స్‌లో మాత్రం జూలు విదిలించాడు.

పూర్తి స్థాయి స్కోరింగ్‌తో శ్రీకాంత్ విజయకేతం ఎగురవేశాడు. ఈ విజయంతో ప్రపంచ బాడ్మింటన్ ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి భారత మేల్ బ్యాడ్మింటన్ క్రీడాకరుడిగా శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. దీంతో భారత్‌కు పతకం ఖాయమని అభిమానులు అంటున్నారు. అయితే సెమీ ఫైనల్‌కు చేరినందుకు లక్ష్య సేన్ కాంస్య పతకం అందుకోనున్నాడు.


Next Story

Most Viewed