1st ODI: ఆ టార్గెట్‌ను టీమిండియా చేధించేనా..?

by  |
1st ODI: ఆ టార్గెట్‌ను టీమిండియా చేధించేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొలొంబో వేదికగా జరిగిన ఇండియా-శ్రీలంక మొదటి వన్డే మ్యాచ్‌లో లంకేయులు యావరేజ్ స్కోర్ నమోదు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేశారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దాసున్ షనకా టీమ్‌లో.. చమిక (43 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌‌గా నిలిచాడు. ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (32), మినోద్(27) పర్వాలేదనిపించారు.

ఆదుకున్న మిడిలార్డర్లు..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాట్స్‌మాన్ రాజపక్స (24), ధనంజయ డిసిల్వా (14) చేతులెత్తేయగా.. మిడిలార్డర్లు అసలంక (38), దాసున్ షనక (39) పరుగులతో స్కోరు బోర్డును ముందుకుతీసుకెళ్లారు. 7వ స్థానంలో వచ్చిన హసనరంగ (8) పరుగులతో విఫలమవ్వగా.. చమిక (43 నాటౌట్)‌ జట్టును ఆదుకున్నాడు. ఇసుర ఉదాన (8), దుష్మంత చమీర (13) పరుగులు చేశారు. లక్ష్మణ్ సందకన్ బ్యాటింగ్ చేయాల్సి ఉండగానే నిర్ణీత ఓవర్లు ముగిశాయి. ఇదే సమయానికి లంకేయులు 262 పరుగులు చేశారు. భారత బౌలర్లు దీపక్ చాహర్ 2, యూజువేంద్ర చాహల్ 2, కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. ఇక 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగబోయే టీమిండియా ఏం చేయనుందో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed