ఎర్రగడ్డలో ఏడు హత్యలు.. 16 ఏండ్ల తర్వాత?

by  |
ఎర్రగడ్డలో ఏడు హత్యలు.. 16 ఏండ్ల తర్వాత?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 హత్యల్లో ప్రధాన నిందితుడు.. ఈ ఏడు హత్యలు కూడా ఒకే రోజులో జరిగినవే.. కానీ, 16 ఏండ్లుగా ప్రధాన నిందితుడు పరారీలోనే ఉన్నాడు. అయినా.. పట్టువదలని పోలీసులు కరుడుగట్టిన నరహంతకుడిని కటకటాలకు నెట్టారు.

గతంలో ఎర్రగడ్డలో కలకలం రేపిన ఏడు హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ డేవిడ్ రాజును శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో మకాం మార్చాడని తెలుసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే 1991 నుంచే డేవిడ్ రాజు నేర చరిత్ర మొదలు పెట్టాడని పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ స్టేషన్లతో పాటు పలు స్టేషన్లో కేసులు ఉండటం గమనార్హం.



Next Story