WTC Final : నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్

by Disha Web Desk 4 |
WTC Final : నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిన్) ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ ఉత్కంఠ పోరు ఓవల్ మైదానంలో మద్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.

రెండేళ్ల కోసారి జరిగే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 2 లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి. ఈ సారి టాప్ ప్లేస్ లో 152 పాయింట్లతో ఆస్ట్రేలియా ఉండగా 127 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. అయితే పిచ్ బౌన్సీగా ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. గిల్, రోహిత్, పుజారా, కోహ్లి, రహానేలతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. అశ్విన్, జడేజా మధ్య తీవ్ర పోటీ ఉండగా జడేజానే ఈ మ్యాచ్ లో ఆడించే చాన్స్ ఎక్కువగా ఉంది.



Next Story

Most Viewed