WPL 2023: 143 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం

by Disha Web Desk 12 |
WPL 2023: 143 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా జరిగిన తొలి WPL మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 143 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. 20 ఓవర్లకు 5 వికెట్ల కోల్పొయి 207 పరుగులు చేసింది. అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ బ్యాటర్లు అందరూ.. ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో 15.1 ఓవర్లకు 64 పరుగులకు గుజరాత్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాక్ నాలుగు వికెట్లు తీసింది. కాగా ఈ విజయంతో మొదటి మ్యాచ్‌లోనే మూడంకేల భారీ తేడాతో విజయం సాధించి.. మైల్ స్టోన్ విక్టరిని ముంబై ఇండియన్స్ పేరుమీద రాసుకున్నారు.

Next Story