బుమ్రా లేకపోతే ఏంటి.. అతనొచ్చాడుగా ముంబైకి..!

by Disha Web Desk 1 |
బుమ్రా లేకపోతే ఏంటి.. అతనొచ్చాడుగా ముంబైకి..!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ కు ముందే ముంబాయ్ ఇండియన్స్ బుమ్రా వెన్ను గాయంతో ఊహించని దెబ్బ తగిలింది. దీంతో పేస్ విభాగాన్ని నడిపించే నాయకుడు కరువయ్యాడు ఆ జట్టుకు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జట్టలోకి వచ్చాడు ఇంగ్లాండ్ పేస్ స్టెన్ గన్ జోఫ్రా ఆర్చర్. గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ కు అతను పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 వేలం సమయానికే జోప్రా ఆర్చర్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతోతో గతేడాది టోర్నీలో ఆర్చర్ ఆడలేడని తెలిసినా.. ముంబాయి జట్టు అతడని వేలంలో రూ.8 కోట్లకి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ నిర్ణయమే ముంబాయ్ ఇండియన్స్ జట్టుకు అదనపు బలంగా మారింది. ఎంతైనా వెన్ను గాయంతో ఐపీఎల్ 2023కి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరు.. ఆర్చర్ తిరిగి జట్టుతో చేరడం ముంబయికి గొప్ప ఊరట లభించనట్లైంది.

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 2న ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఇప్పటికే వాంఖడేలో సాధనను ముమ్మరం చేసింది. తాజాగా జోప్రా ఆర్చర్ క్యాంప్‌లో చేరిన సందర్భంగా ముంబయి ఫ్రాంఛైజీ విడుదల చేసింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీంకి గతంలో ఆడిన జోప్రా ఆర్చర్.. ఇప్పటి వరకు 35 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు.

Next Story

Most Viewed