పాకిస్తాన్‌కు షాకిచ్చిన విండీస్.. 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై కరేబియన్ జట్టు సంచలనం

by Harish |

పాకిస్తాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది.

పాకిస్తాన్‌కు షాకిచ్చిన విండీస్.. 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై కరేబియన్ జట్టు సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. రెండో టెస్టులో పాక్‌ను ఓడించడం ద్వారా పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. గతంలో 1990లో పాక్‌లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. ముల్తాన్‌లో సోమవారం ముగిసిన మ్యాచ్‌లో విండీస్ 120 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 163 రన్స్ చేయగా.. పాక్ 154 స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 244 స్కోరు చేసి పాక్ ముందు 254 పరుగుల లక్ష్యం పెట్టింది. జొమెల్ వర్రికన్(5/27) విజృంభించడంతో ఛేదనలో పాక్ తేలిపోయింది. 133 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 76/4తో ఆట కొనసాగించిన పాక్ మరో 57 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజామ్(31) టాప్ స్కోరర్. ఆఖరి 6 వికెట్లలో నాలుగు వికెట్లు వర్రికన్ ఖాతాలోనే చేరాయి. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 36 వికెట్లు పేసర్లే తీయడం విశేషం. సిరీస్‌లో 19 వికెట్లుతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన వర్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.


Next Story