భారత్, శ్రీలంక టీ20 సిరీస్ ఖరారు.. వైజాగ్‌లో రెండు మ్యాచ్‌‌లు

by Harish |

ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లు ఆడేందుకు సిద్ధమవుతోంది.

భారత్, శ్రీలంక టీ20 సిరీస్ ఖరారు.. వైజాగ్‌లో రెండు మ్యాచ్‌‌లు
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లు ఆడేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో సొంతగడ్డపై శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 21, 23, 26, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖటపట్నం ఆతిథ్యమివ్వనుంది. చివరి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి. భారత జట్టు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌తో చివరిసారిగా టీ20లు ఆడింది. ఆ సిరీస్‌ను 3-2తో గెలిచింది.


Next Story