అనుష్కతో సెల్ఫీ కోసం ఎగబడిన ఫ్యాన్స్.. ఫైర్ అయినా కోహ్లీ..

by Disha Web Desk 12 |
అనుష్కతో సెల్ఫీ కోసం ఎగబడిన ఫ్యాన్స్.. ఫైర్ అయినా కోహ్లీ..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క ఫ్యాన్స్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ అనంతరం సెంట్రల్ టిఫిన్ రూమ్ వెలుపల ఈ ఘటన జరిగింది. అయితే సెంట్రల్ టిఫిన్ లోకి అనుష్క శర్మతో వెళుతుండగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారిని చుట్టుముట్టారు. అలాగే అనుష్క శర్మతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానులు వారి వ్యక్తిగత సెక్యూరిటీని దాటుకుని వెళ్లారు. అలాగే ఓ అభిమాని.. అనుష్కను దారిలో పెట్టమని కోహ్లికి గట్టిగా అరిచి చెప్పాడు. దీంతో కోహ్లీకి తీవ్రంగా కోపం వచ్చి అక్కడినుంచి వెంటనే వెళ్లి పోయాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.

Next Story