నేడు భారత్ - న్యూజిలాండ్ రెండో వన్డే

by Disha Web Desk 4 |
నేడు భారత్ - న్యూజిలాండ్ రెండో వన్డే
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ కివీస్‌తో రెండో వన్డేలో తలపడనుంది. రాయ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డేలో 350 పరుగులు చేసి 131 పరుగులకే 6 వికెట్లు తీసినా న్యూజిలాండ్ 337 పరుగుల స్కోరు చేయడంతో మన బౌలర్లు తేలిపోయారు. అయితే రెండో వన్డేకు వేదికైన రాయ్‌పూర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇక్కడి స్పిచ్ బ్యాటింగ్, స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని పిచ్ క్యూరేటర్లు తెలిపారు.

Also Read...

వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్


Next Story

Most Viewed