వాళ్లు చాలా డేంజర్.. ఆసిస్ బౌలర్లకు పాంటింగ్ వార్నింగ్

by Disha Web Desk 1 |
వాళ్లు చాలా డేంజర్.. ఆసిస్ బౌలర్లకు పాంటింగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ తో మొన్నటి వరకు మునిగి తేలిన టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిన భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్నారు. అక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.. ఇంగ్లాండులోని ఓవల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలబడబోతోంది. జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ సాగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈసారి సంప్రదాయమైన క్రికెట్లో, అత్యుత్తమ ఫైనల్లో విజయం సాధించి ఏ జట్టు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో.. ఇక ఆస్ట్రేలియా బౌలర్లకు ఆ జట్టు మాజీ సారథి కీలక సూచనలు చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, పూజార, గిల్ పై ఆస్ట్రేలియా బౌలర్లు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలంటూ రికీ పాంటింగ్ సూచించాడు. ఐపీఎల్ లో కోహ్లీ, గిల్ బికరమైన ఫామ్ని చూశాం. ఇక టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ పూజారను అడ్డుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్ లాగానే ఉంటుంది. అక్కడ కోహ్లీ పూజార చెలరేగే ఛాన్స్ ఉంది. వారిని అడ్డుకోకపోతే ఆస్ట్రేలియాకు విజయం కష్టమే అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed