Uppal Test Match: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..

by Disha Web Desk 16 |
Uppal Test Match: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..
X

దిశ, వెబ్ డెస్క్: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోయి భారత్ 119 పరుగులు చేసింది. క్రీజుల్లో యశస్వీ జైశాల్ (76), శుభమాన్ గిల్ (14) పరుగులతో ఉన్నారు. భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ 24 పరుగులు చేసి అవుటయ్యారు. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 23 ఓవర్లు ఆడి 119 పరుగులు చేసింది. మరో 127 పరుగులు సాధిస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పై చేయి సాధిస్తుంది. భారత్ బౌలింగ్‌లో బూమ్రా 2, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 3, అక్సర్ 2 వికెట్లు తీశారు. కాగా ఇంగ్లండ్ స్కోర్: 246. తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో స్టోక్ (70),బెయిర్ స్టో (37, రూట్ (29), డుక్కెట్ (35), టామ్ హాట్లి (23) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో జాక్ లీచ్ ఒక వికెట్ తీశారు.

Next Story

Most Viewed