ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా

by Malleboina Mahesh |

పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు ఐసీసీ (ICC) పురుషుల టీ20ఐ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా
X

దిశ, వెబ్ డెస్క్: జింబాబ్వేతో టీ20 కి ముందు వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడి పోయి రెండు సీరీస్ లను భాతర జట్టు (Bhatara team) పోగొట్టుకుంది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ అయిన భారత క్రికెట్ జట్టు ఐసీసీ (ICC) పురుషుల టీ20ఐ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. జింబాబ్వేతో హరారే వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో భారత్ అగ్రస్థానానికి చేరినట్లు ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు 4-0 తో సిరీస్ గెలిచి టీమిండియా నుంచి నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకోగా, అంతకు ముందు భారత్ ఐర్లాండ్ చేతిలో 0-2తో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా, జింబాబ్వేపై వరుస విజయాలతో మళ్లీ ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది.

Next Story