పాకిస్తాన్‌తో మ్యాచ్.. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-05 12:57:22  IST  )

ఉమెన్స్ వరల్డ్ కప్‌(ICC Womens World Cup 2025)లో భాగంగా శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

పాకిస్తాన్‌తో మ్యాచ్.. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ వరల్డ్ కప్‌(ICC Womens World Cup 2025)లో భాగంగా శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్‌‌కు దిగింది. ఓపెనర్లు స్మృతీ మందాన, ప్రతిక మంచి ఆరంభాన్నే ఇచ్చినా.. స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిరాశ పర్చారు. తక్కువ స్కోర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం క్రీజులో జేమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఉన్నారు. 34 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 154 పరుగులు చేసింది. ప్రతిక(31), స్మృతీ(23), డియోల్(46), కెప్టెన్ కౌర్(19) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో సాధియా, డియానా, ఫాతిమా, షమీమ్ తలో వికెట్ తీశారు.

Read More..

భారత్ vs పాకిస్తాన్.. మహిళల క్రికెట్‌లోనూ ముదురుతున్న వైరం

Next Story