Surya Kumar Yadav: రేపే తొలి T20...నెంబర్ 3లో వచ్చేది అతనే

by velandi.Saikiran |   (  Updated:2026-01-20 14:16:40  IST  )

శ్రేయాస్ అయ్యర్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అర్హుడని వెల్లడించారు సూర్య కుమార్ యాదవ్.

Surya Kumar Yadav: రేపే తొలి T20...నెంబర్ 3లో వచ్చేది అతనే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రెండు జట్ల మధ్య వన్డేలు జరగగా, ఇప్పుడు టీ20లు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రేపు న్యూజిలాండ్ తో జరగబోయే మొదటి టీ20లో ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ప్రకటన చేశారు సూర్య కుమార్ యాదవ్.

మూడో స్థానంలో ఇషాన్ కిష‌న్‌

శ్రేయాస్ అయ్యర్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అర్హుడని వెల్లడించారు. మరోవైపు అయ్య‌ర్‌ ఆట తీరులో మార్పు ఉండబోదని.. గతంలో ఎలా దూకుడుగా ఆడాడో ? ఇప్పుడు అలాగే ఆడతాడని వెల్లడించారు. కచ్చితంగా న్యూజిలాండ్ పై విజయం సాధిస్తామని సూర్య కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాగ్ పూర్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లైవ్ చూసే అవకాశం ఉంటుంది.

Next Story