సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా..

by Disha Web Desk 13 |
సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. తనకు ఎంతో ఇష్టమైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఏప్రిల్ 24న సచిన్ 50 జన్మదినం జరుపుకోనున్నాడు. సచిన్ బర్త్ డే అయిన ఏప్రిల్ 24 కు ఒక్క రోజు ముందే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సన్నాహాలు చేస్తున్నది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన సచిన్‌కు కృతజ్ఞతగా ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వాళ్లు తెలిపారు.

దీనికి సచిన్ కూడా అంగీకారం తెలిపాడని, ఇదే వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహమని చెప్పారు. ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తెలిపారు.



Next Story