ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్.. పంత్ వచ్చేస్తున్నాడు..!

by Dishafeatures2 |
ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్.. పంత్ వచ్చేస్తున్నాడు..!
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అన్ని జట్లు ఈ మెగా ఈవెంట్ లో సత్తా చాటడానికి సిద్ధమయ్యాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ సీజన్ లో దుమ్ము రేపడానికి రెడీ అయ్యింది. గత సీజన్ లో కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ జట్టు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. అయితే రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ కావడం, ఆయన ఇంటికే పరిమితం కావడం ఢిల్లీ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రిషబ్ పంత్ లేకుండానే ఈ సారి ఢిల్లీ టీమ్ ఐపీఎల్ లోకి అడుగు పెట్టింది. అయితే పంత్ ఈ సీజన్ లోనే ఢిల్లీ జట్టులోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది. అయితే ఓ ఆటగాడిగా కాక ఓ మెంటర్ గా ఢిల్లీ జట్టుకు పంత్ సేవలు అందించనున్నారని సమాచారం. ఆటగాళ్లలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు పంత్ సరికత్త అవతారం ఎత్తబోతున్నారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యాం శర్మ చెప్పారు. ‘‘ పంత్ కు అభ్యంతరం లేకపోతే ఢిల్లీలో జరిగే మ్యాచులకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటి నుంచి తీసుకురావడం.. తీసుకుపోవడం వంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆయన కోసం ఓ స్పెషల్ ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. ఇక జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించి ప్రతి మ్యాచ్ కు పంత్ ఉండాలని కోరుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్ లో.. డగౌట్ లో పంత్ సేవలు వినియోగించుకుంటాం. ఆయన జట్టుతో ఉంటే సభ్యులకు ధైర్యంగా ఉంటుంది’’ అని అన్నారు. ఇది నిజమైతే ఈ సీజన్ లో రిషబ్ పంత్ కొత్త అవతారంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు సేవలు అందించనున్నారు.


Next Story

Most Viewed