ఐపీఎల్‌ ఫామ్‌‌ను కొనసాగిస్తా: Rinku Singh

by Disha Web Desk 17 |
ఐపీఎల్‌ ఫామ్‌‌ను కొనసాగిస్తా: Rinku Singh
X

డుబ్లిన్: ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమ్ ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రింకు సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం రింకు సింగ్ మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘చాలా ఆనందంగా ఉన్నా, ఐపీఎల్‌లో ఏదైతే చేశానో అదే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తా, ఆ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. 10 ఏళ్లుగా కష్టపడుతున్నా, నా ప్రయత్నాలు ఫలించాయి. తొలి గేమ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నా, ఇంతకంటే ఆనందం ఏం ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఐర్లాండ్‌తో తొలి టీ20లో రింకుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు.



Next Story

Most Viewed