- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashwin: వైభవ్ తప్పేం లేదు.. లంక ప్లేయర్లే రెచ్చగొట్టారు
వైభవ్ తప్పేం లేదని లంక ప్లేయర్లే రెచ్చగొట్టారని అశ్విన్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక A జట్టు ప్లేయర్లతో వైభవ్ గొడవ పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో వైభవ్ ను దోషిగా చూపిస్తూ యాక్షన్ తీసుకోవాలని పలువురు డిమాండ్ కూడా చేస్తున్నారు. 15 ఏళ్ల వైభవ్ కెరీర్ ను అంతమొందించే కుట్రలకు తెరలేపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ గొడవపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. నిన్న జరిగిన సంఘటనలో వైభవ్ తప్పేం లేదని, శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టినట్లు మండిపడ్డారు.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా వైభవ్ నడుచుకుంటూ వెళ్తున్నాడని, ఆ సమయంలో లంక ప్లేయర్లే అనవసరంగా రెచ్చగొట్టినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే వైభవ్ కూడా రివర్స్ అయినట్లు గుర్తు చేశారు. వీడియో చూస్తే మనకు క్లారిటీగా ఇది అర్థమవుతుందన్నారు. అనవసరంగా వైభవ్ పై తప్పుడు ప్రచారం చేయకండని కోరారు. వైభవ్ పై యాక్షన్ తీసుకునే ముందు ఐసీసీ అన్ని విషయాలను పరిశీలించాలన్నారు.






