సెల్ఫీ దిగలేదని పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి..

by Disha Web Desk 13 |
సెల్ఫీ దిగలేదని పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై కొందరు దుండగులు దాడి చేశారు. ముంబైలోని విలే పార్లే ఈస్ట్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో పృథ్వీ షాని కొందరు క్రికెట్ ఫ్యాన్స్, సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరుతూ మీదకి వచ్చారు. అయితే పృథ్వీ షా వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. దీంతో అతన్ని వెంబడించిన 8 మంది దుండగులు, పృథ్వీ షా స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు పై దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితులు సనా, శోభిత సహా మొత్తం 8 మంది దాడి చేశారు. దాడికి పాల్పడ 8 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా టూర్‌లో పృథ్వీ షాని ప్రధాన ఓపెనర్‌గా ఎంపిక చేసింది టీమిండియా. అయితే ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీ షా.



Next Story