- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్కు పాక్ జట్టు.. ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ కోసం తప్పదు!
ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ కోసం భారత్కు పాక్ జట్టు రాక తప్పదు. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలపనుందని క్రీడాశాఖ చెప్తోంది.

దిశ, స్పోర్ట్స్: భారత్లో జరిగే హాకీ ఆసియా కప్, జూనివయర్ వరల్డ్ కప్లలో పాల్గొనేందుకు పాక్ జట్టు కూడా ఇండియాకు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతినడంతో ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి క్రీడాపోటీలు జరగడం లేదనే సంగతి తెలిసిందే. అయితే భారత్లో జరిగే మల్టీనేషనల్ ఈవెంట్స్లో పాకిస్తాన్ పాల్గొనడాన్ని అడ్డుకోబోమని కేంద్రం తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 7 వరకు బిహార్లోని రాజ్గిర్ వేదికగా హాకీ ఆసియా కప్ జరగనుంది.
అలాగే చెన్నై, మదురై వేదికలుగా నవంబరు 28 నుంచి డిసెంబరు 10 వరకు జూనియర్ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాక్ పాల్గొనకుండా అడ్డుకుంటే ఒలింపిక్ చార్టర్ను ధిక్కరించినట్లు అవుతుందని, కావున భారత్కు పాక్ జట్టు వచ్చేందుకు క్రీడాశాఖ అంగీకరించనుందని సమాచారం. అయితే క్రికెట్ ఆసియా కప్కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో బీసీసీఐ ఇంకా తమను సంప్రదించలేదని క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి.






