ఆసియా క్రీడల్లో దుమ్ములేపుతున్న భారత ఆర్చర్లు

by Disha Web Desk 2 |
ఆసియా క్రీడల్లో దుమ్ములేపుతున్న భారత ఆర్చర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు భారత పతకాల సంఖ్య 90కి చేరింది. అందులో గోల్డ్ 21, సిల్వర్ 33, కాంస్యం 36 పతకాలు ఉన్నాయి. కాగా, ఇవాళ అర్చరీ టీమ్ మరో విజృంభించింది. అర్చరీ మెన్స్ రికర్వ్ టీమ్‌ అటాను, తుషార్, ధీరజ్ సిల్వర్ మెడల్ సాధించారు. అర్చరీ మహిళల రికర్వ్ టీమ్‌‌లో అంకిత, బజన్ కౌర్, సిమ్రన్‌జిత్ ఇవాళ కాంస్య పతకం పొందారు. మరోవైపు బ్యాట్‌మెంటన్ మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్ కాంస్యపతకం లభించింది. ఇక, సెపాక్‌తక్రా అనే గేమ్‌లో ఉమెన్స్ టీం కాంస్యం గెలుచుకుంది. మరోవైపు మెన్స్, ఉమెన్స్ కబడ్డి టీమ్స్, మెన్స్ క్రికెట్ టీమ్ ఫైనల్‌కు చేరింది.



Next Story

Most Viewed