- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సెమీస్లో సిక్కిరెడ్డి జోడీ ఓటమి
by Dishanational3 |
X
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కిరెడ్డి-సుమిత్ రెడ్డి పోరాటం ముగిసింది. సెమీస్లో ఈ జంట టోర్నీ నుంచి నిష్ర్కమించింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సిక్కిరెడ్డి-సుమిత్ జోడీ 17-21, 12-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన రినోవ్ రివాల్డీ-మెంటారీ చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో వరుస విజయాలతో టైటిల్ ఆశలు రేపిన సిక్కి రెడ్డి జంట ఫైనల్కు అడుగుదూరంలో ఇంటిదారిపట్టింది. దీంతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం కూడా ముగిసింది. సింగిల్స్లో ఇప్పటికే స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
Next Story