హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌కు పయనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 11:55:06  IST  )

భారత్‌ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి హైదరాబాద్‌ చేరుకున్నారు.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌కు పయనం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన.. నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే మెస్సిని కలిసేందుకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం అనంతరం ఫొటో సెషన్ సందర్భంగా మెస్సీని మీట్ అయ్యే వారికి ఇప్పటికే క్యూ‌ఆర్‌ కోడ్‌‌లను కేటాయించారు. రాహుల్‌గాంధీతో పాటు మెస్సి, ఇతర వీఐపీల రాక సందర్భంగా ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story