ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

by Disha Web Desk 13 |
ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. లండన్‌ వేదికగా జూన్‌ 1న టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమవగా.. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతూ గాయపడ్డ ఆ జట్టు వెటరన్‌ పేసర్‌ జేమ్స్ ఆండర్సన్‌ ఫూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్‌‌కి టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు గాయం కారణంగా ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో కూడా ఈ టెస్టుతో జట్టులో చేరనున్నాడు.

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (సి), జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, క్రిస్ వీ రూట్, , మార్క్ వుడ్

Next Story

Most Viewed