JioCinema: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా భారత్-ఆసీస్ సిరీస్

by Disha Web Desk 13 |
JioCinema: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా భారత్-ఆసీస్ సిరీస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌ అభిమానులకు జియో సినిమా గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్‌ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్‌ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో రాజ్‌కోట్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 5న జరిగే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది.

Next Story

Most Viewed