నాలుగో టెస్టులో భారత్‌కు షాక్.. బ్యాటింగ్ చేయకుండానే స్కానింగ్ కోసం వెళ్లిన అయ్యర్

by Disha Web Desk 12 |
నాలుగో టెస్టులో భారత్‌కు షాక్.. బ్యాటింగ్ చేయకుండానే స్కానింగ్ కోసం వెళ్లిన అయ్యర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు షాక్ తగిలింది. నాలుగో టెస్ట్ నాలుగో మ్యాచ్ లో భారత్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది. కాగా అయ్యార్ జడేజా కంటే ముందే బ్యాటింగ్ చేయాల్సి ఉండగా అతని స్థానంలో ప్రస్తుతం జడేజా, భరత్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేశారు. కానీ శ్రేయస్ మాత్రం బ్యాటింగ్ రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన బీసీసీఐ శ్రేయస్ అయ్యర్.. నడుము నొప్పితో బాదపడుతున్నాడని.. అతన్ని స్కానింగ్ కోసం పంపించినట్లు ప్రకటించింది. అలాగే అయ్యర్ ను తమ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.


Next Story

Most Viewed