IPL2023: హైదరాబాద్ టీమ్‌లో సెహ్వాగ్ మేనల్లుడు

by Disha Web Desk 2 |
IPL2023: హైదరాబాద్ టీమ్‌లో సెహ్వాగ్ మేనల్లుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీడ్(ఐపీఎల్) 2022 ఆక్షన్ రసవత్తరంగా సాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఆటగాళ్ల వేలం జరిగింది. మొత్తం 405 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 51 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ల పంట పండింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ రూ.18.50 కోట్లతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. మరో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

అయితే, గతంలో ఎన్నడూ లేనంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి అత్యధికంగా 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్ దాగర్‌ పాల్గొనగా.. హైదరాబాద్ జట్టు దక్కించుకున్నది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఆల్‌రౌండర్ మయాంక్ దాగర్‌ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య గట్టి పోటీ జరిగింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు ఉండగా.. హైదరాబాద్ జట్టు రూ.1.8 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. మయాంక్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో మయాంక్ 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరి ఐపీఎల్‌లో ఎంతమేరకు రాణిస్తాడో వేచి చూడాలి.

Also Read..

బంగ్లాతో రెండో టెస్ట్: పట్టుబిగిస్తున్న టీమిండియా

Next Story

Most Viewed