IPL 2023: కేకేఆర్‌కు షాక్.. కెప్టెన్‌కు ఫైన్

by Disha Web Desk 13 |
IPL 2023: కేకేఆర్‌కు షాక్.. కెప్టెన్‌కు ఫైన్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాకు ఫైన్ పడింది. కోల్‌కతా జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్లు వేయలేకపోయింది. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 12 శాతం కోత విధిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. రాణాకు ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడటం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికి దాదాపు ప్రతి జట్టు కెప్టెన్ ఈ ఫైన్ ఎదుర్కోవడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ అదరగొట్టాడు. చివరి బంతికి బౌండరీ బాది తన జట్టుకు విజయం అందించాడు. ఈ విజయంతో ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్ మరో అడుగు ముందుకేసింది. 10 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా కేకేఆర్ ఐదో స్థానానికి చేరింది.


Next Story