కొత్త జెర్సీ లాంచ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్..

by Disha Web Desk 13 |
కొత్త జెర్సీ లాంచ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు వారాల్లో ఐపీఎల్ పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఢిల్లీ కేపిటల్స్ ఆదివారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. బ్లూ, రెండ్ కాంబినేషన్‌లో జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. ఏప్రిల్ 1న ఢిల్లీ కేపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌తో తలపడుతుంది. ఐపీఎల్ మినీ వేలంలో 5 ప్లేయర్లను కొనుగోలు చేసిన ఢిల్లీ.. జట్టును మరింత బలోపేతం చేసుకుంది.

ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసౌను రూ. 4.60 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఇషాంత్ శర్మ, మనీష్ పాండేలను కూడా సొంతం చేసుకుంది. పాండేను రూ. 2.4 కోట్లకు, ఇషాంత్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే, బెంగాల్ సీమర్ ముకేశ్ కుమార్‌ను 5.5 కోట్లకు తెచ్చుకుంది. ముకేశ్ 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ కేపిటల్స్ జట్టు:

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీషా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిక్ నోకియా, చేతన్ సకారియా, కమలేశ్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్ రహ్మాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముకేశ్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసౌ, రిషభ్ పంత్

Next Story

Most Viewed