భారత్ ఘోర ఓటమి

by Muthe.Rajitha |

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్(Austrelia vs India) ఘోర ఓటమి పాలైంది.

భారత్ ఘోర ఓటమి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్(Austrelia vs India) ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారత్ పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం 265 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా... రెండు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచుల సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ జట్టులో షార్ట్(74), కాన్లీ(61), ఓవెన్(36) పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించారు. ఇక పెర్త్ లో జరిగిన మొదటి వన్డేలో కూడా భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో వన్డే ఈనెల 29న సిడ్నీలో జరగనుంది.

Next Story