డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆటగాళ్ల ఎంపిక.. స్టాండ్ ప్లేయర్లుగా జట్టులోకి..

by Disha Web Desk 13 |
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆటగాళ్ల ఎంపిక.. స్టాండ్ ప్లేయర్లుగా జట్టులోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టు జాబితాపై బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడితో పాటు పేసర్‌ ముఖేష్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌కు స్టాండ్‌బై జాబితాలో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ తుదిపోరులో లండన్‌ వేదకగా జూన్‌ 7-11 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed