ఆసియా క్రీడల్లో భారత్ కు మూడు పతకాలు

by Disha Web Desk 1 |
ఆసియా క్రీడల్లో భారత్ కు మూడు పతకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. బరిలోకి దిగిన తొలిరోజే పలు విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. 10మీ. మహిళల షూటింగ్ లో మెహులి ఘోష్, రమిత జట్టు సిల్వర్ మెడల్ సాధించారు. అదేవిధంగా పురుషుల లైట్ వెయిట్ స్కల్స్ ఫైనల్ మ్యాచ్ లో రోవర్లు అర్జున్, అరవింద్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అదేవిధంగా మహిళల క్రికెట్ సెమీస్ సమరంలో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఇప్పటికే సెమీస్ లో గెలుపొందడంతో భారత్ కు పతకం ఖరారైంది. చివరగా ఫైనల్ లోనూ విజయం సాధిస్తే స్వర్ణ పతకం లాంఛనమే.

Next Story

Most Viewed