- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీనియర్ క్రికెటర్లు యువతకు స్ఫూర్తిప్రదాతలు : హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో : సీనియర్ క్రికెటర్లు యువ ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాతలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీసీఏటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్టర్స్ ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్)లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం అజీజ్నగర్లో జరిగిన ఎంపీఎల్ ఫైనల్ ముగింపు వేడుకలకు జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై.. విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ క్రికెటర్లు ఎండ, వయసును లెక్క చేయకుండా పోటాపోటీగా క్రికెట్ ఆడుతుంటే తనకు ఆడాలని ఉత్సాహం కలుగుతుందన్నారు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో సీనియర్లు హెచ్సీఏకు సహకరించాలని చెప్పారు. వెటరన్ క్రికెట్ అసోసియేషన్కు హెచ్సీఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ముగింపు వేడుకల్లో వీసీఏటీ వ్యవస్థాపక సభ్యుడు కన్నన్, ఎస్పీవై రెడ్డి, సురేందర్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.