క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ ఓటమి

by Dishanational3 |
క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. సింగిల్స్‌లో ఇప్పటికే భారత షట్లర్లు ఇంటిదారి పట్టగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ సైతం క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి జోడీ 16-21, 14-21 తేడాతో చైనాకు చెందిన లి యి జింగ్-లివో జు మిన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ఒక దశలో 8-5తో ఆధిక్యంలో ఉన్న గాయత్రి, ట్రీసా జాలీ జోడీ ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయింది. అయితే, 15-15 వరకు పోటీనిచ్చిన భారత జంట అనంతరం అనవసర తప్పిదాలతో తొలి గేమ్‌ను కోల్పోయింది. ఇక, రెండో గేమ్‌లో ప్రత్యర్థి జంట దూకుడును గాయత్రి జోడీ నిలువరించలేకపోయింది. ఫిబ్రవరిలో జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లోనూ గాయత్రి జోడీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.


Next Story

Most Viewed