సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్.. టీమిండియా నుంచి నితీష్‌ కుమార్ రెడ్డి అవుట్

by Kema Shiva Kumar |

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మార్పలు చేసింది.

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్.. టీమిండియా నుంచి నితీష్‌ కుమార్ రెడ్డి అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మార్పలు చేసింది. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న నితీశ్ కుమార్ రెడ్డిని తొలి టెస్టు జట్టు నుంచి విడుదల చేసింది. రాజ్‌కోట్‌లో సౌతాఫ్రికా-Aతో జరిగే వన్డే సిరీస్‌ కోసం నితీశ్ భారత్-A జట్టులో చేరనున్నాడు. నవంబర్ 13 నుంచి 19 వరకు భారత్-A, సౌతాఫ్రికా-A జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే నవంబర్ 22 నుంచి గౌహతి‌ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం నితీశ్‌ కుమార్ రెడ్డి మళ్లీ భారత జట్టుతో కలవనున్నాడు.

తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇలా..

శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (VK, VC), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్‌ దీప్.

సౌతాఫ్రికా-Aతో వన్డే సిరీస్‌కు భారత జట్టు..

తిలక్ వర్మ (V), రుతురాజ్ గైక్వాడ్ (VC), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (WK), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (WK), నితీశ్‌ కుమార్ రెడ్డి.

Next Story