టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక చిత్తు

by velandi.Saikiran |

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్ లోనే ఇంగ్లండ్ బోణీ కొట్టింది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక చిత్తు
X

దిశ‌, వెబ్ డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్ శుక్రవారం ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్, శ్రీలంక తలపడ్డాయి. ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్, 87 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి, 219 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని మహిళల శ్రీలంక జట్టు ఛేదించే క్రమంలో విఫలమైంది. 20 ఓవ‌ర్లు ఆడిన శ్రీలంక, 132 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టింది. ఇక ఇవాళ మొత్తం మూడు మ్యాచ్ లు జ‌రుగ‌నున్నాయి. ఆదివారం భారత్, పాక్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Next Story