టీమిండియాతో తొలి టెస్టు.. జట్టును ప్రకటించిన ఈసీబీ

by Kema Shiva Kumar |

జూన్ 20 నుంచి టీమిండియా (Team India)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో భాగంగా హెడింగ్లీ (Headingley) వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇవాళ తమ జట్టును ప్రకటించింది.

టీమిండియాతో తొలి టెస్టు.. జట్టును ప్రకటించిన ఈసీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 20 నుంచి టీమిండియా (Team India)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో భాగంగా హెడింగ్లీ (Headingley) వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇవాళ తమ జట్టును ప్రకటించింది. జట్టు సారథిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్‌లకు జట్టులో చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్‌గా జేమీ ఒవర్టన్ టీమ్‌లోకి వచ్చాడు. బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్, జోష్‌ టంగ్, క్రిస్ వోక్స్, సామ్ కుక్ బౌలింగ్ బాధ్యతలను తీసుకోనున్నారు.

ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (VC & WK), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (WK), వాషింగ్టన్ సుందర్, జస్ఫురిత్ థాక్రురా, జస్ఫురిత్ బి. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

Next Story