ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ.. డైరెక్ట్‌గా ఫైనల్‌కు అర్హత

by Disha Web Desk 12 |
ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ.. డైరెక్ట్‌గా ఫైనల్‌కు అర్హత
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 లీగ్‌ దశ చివరి మ్యాచులు అన్ని జట్లు ఆడేశాయి. మంగళవారం జరిగిన లీగ్ చివరి దశ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యూపీని ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీంతో 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.5 ఓవర్లకు లక్ష్యాన్ని చేధించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో WPL పాయింట్స్ టేబుల్ టాప్‌లో ఢిల్లీ నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేరుగా WPL ఫైనల్ చేరుకుంది. అలాగే టపుట్ 2,3 స్థానాల్లో ఉన్న ముంబై, యూపీ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్ ఈ నెల 24న ఆడనున్నారు. ఇందులో గెలిచిన జట్టు మార్చి 26 ఫైనల్ లో ఢిల్లీతో తలపడతారు.



Next Story