PKL 10: దబాంగ్ ఢిల్లీ కేసీ చేతిలో గుజరాత్ జెయింట్స్ ఓటమి

by Dishanational5 |
PKL 10: దబాంగ్ ఢిల్లీ కేసీ చేతిలో గుజరాత్ జెయింట్స్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న గుజరాత్ జెయింట్స్‌ను దబాంగ్ ఢిల్లీ కేసీ చిత్తు చేసింది. నోయిడా వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌‌పై 28-35 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. అయితే, ఫస్టాఫ్ ముగిసే సమయానికి గుజరాత్ జట్టే 16-14తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, సెకండాఫ్‌లో ఢిల్లీ ప్లేయర్లు దూకుడు పెంచారు. గుజరాత్‌ను నిలువరించడంతో సెకండాఫ్‌ ఏకపక్షంగా సాగింది. దీంతో 7 పాయింట్స్ తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీ గెలుపొందింది. కెప్టెన్ ఆషు మాలిక్ 11 పాయింట్లతో, మన్‌జీత్ 9 పాయింట్లతో సత్తాచాటారు. హ్యాట్రిక్ విజయం తర్వాత గుజరాత్ ఓటమి చవిచూడగా.. దబాంగ్ ఢిల్లీకి ఇది వరుసగా రెండో గెలుపు. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ 2వ స్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ 3వ స్థానానికి చేరుకున్నది.


Next Story