గెలిస్తే ఒక్కొక్కరికి రూ.కోటి.. ఆటగాళ్లకు సీఎం బంపర్ ఆఫర్!

by Disha Web Desk 4 |
గెలిస్తే ఒక్కొక్కరికి రూ.కోటి.. ఆటగాళ్లకు సీఎం బంపర్ ఆఫర్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత హాకీ ఆటగాళ్లకు సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కో ఆటగాడికి రూ.కోటి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. హాకీ ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కో ఆటగాడికి రూ.కోటి ఇస్తామని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. భువనేశ్వర్, రవుర్కెలా వేదికగా జనవరి 13న ప్రపంచకప్ ప్రారంభం కానుండగా సీఎం నవీన్ పట్నాయక్ హాకీ విలేజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఛాంపియన్‌గా నిలవాలని కాంక్షించారు. హాకీ ప్రపంచ కప్‌లో పాల్గొననున్న ఇండియా టీమ్‌కు అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల రవుర్కెలాలో 15 ఎకరాల్లో రూ.146 కోట్లతో నిర్మిచిన హాకీ స్టేడియానికి గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా పేరు పెట్టారు. దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియంగా ఇది నిలిచింది. 21 వేల సీటింగ్ కెపాసిటీ, ఆటగాళ్ల కోసం 225 గదులను నిర్మించారు. స్టేడియానికి చేరుకునేందుకు 30 బస్సులను అందుబాటులో ఉంచారు. ఈ స్టేడియంను నవీన్ పట్నాయక్ ఆరభించారు.

Also Read...

భారత్‌పై శ్రీలంక విజయం.. సిరీస్ సమం

Next Story