BIG NEWS: మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం.. కన్నీరుమున్నీరు అవుతున్న సీఎస్‌కే ఫ్యాన్స్, జట్టుకు కొత్త కెప్టెన్ అతడే!

by Disha Web Desk 1 |
BIG NEWS: మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం.. కన్నీరుమున్నీరు అవుతున్న సీఎస్‌కే ఫ్యాన్స్, జట్టుకు కొత్త కెప్టెన్ అతడే!
X

దిశ, వెబ్‌‌డెస్క్: క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ 17వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. మార్చి 22 నుంచి దాదాపు 74 రోజుల పాటు ఈ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ నుంచి ఆటకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎస్‌కే జట్టు యాజమాన్యానికి తెలిపినట్లుగా జోరుగు వార్తలు షికారు చేస్తున్నాయి.

ఆ పుకార్లకు అజ్యం పోసినట్లుగా తాజాగా, ట్విట్టర్ వేదికగా మహేంద్ర సింగ్ ధోని ‘కొత్త సీజన్‌‌‌‌లో.. కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను’ అని పెట్టిన పోస్ట్ ఆ రూమర్స్‌కు బలం చేకూర్చుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సీఎస్‌కే ఫాన్స్ అతడి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాత్ర అంటే ఎమ్మెస్ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెబితే.. అతడి స్థానంలో చెన్నై సారథిగా జట్టు డ్యాషింగ్ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.



Next Story

Most Viewed