14న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |

బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈనెల 14న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది.

14న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈనెల 14న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో జట్లు తమ సంబంధిత పోటీల్లో టైటిల్ గెలిచిన తర్వాత జరిగే విజయోత్సవాలకు సంబంధించి సరికొత్త నియమ నిబంధనలు, మార్గదర్శకలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, చిన్నస్వామి తొక్కిసలాట (Stampede)లో 11 మంది మరణించగా.. 50 మందికిపైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సుమోటోగా స్వీకరించిన కర్ణాటక న్యాయస్థానం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story