వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్.. ఫైనల్ రేసులో ఉండాలంటే ఆ టెస్టులో టీమ్ ఇండియా గెలవాల్సిందే!

by Disha Web Desk 13 |
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్.. ఫైనల్ రేసులో ఉండాలంటే ఆ టెస్టులో టీమ్ ఇండియా గెలవాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్ చేరింది. ఇండోర్ టెస్టులో టీమ్ ఇండియా పై విజయం సాధించడంతో నేరుగా అర్హత సాధించింది. మూడో టెస్టు గెలుపుతో ఆసీస్‌ 68.52 పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ చివరి టెస్టులో గెలిస్తేనే డబ్లూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడం కానీ, డ్రా గానీ జరిగితే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలున్నాయి. ఇప్పుడు భారత్‌కు నాలుగో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్లూటీసీ ఫైనల్‌ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది.


Next Story