ఢిల్లీ టెస్టుకు మరో స్పిన్నర్‌‌తో రంగంలోకి దిగనున్న ఆసీస్..

by Disha Web Desk 13 |
ఢిల్లీ టెస్టుకు మరో స్పిన్నర్‌‌తో రంగంలోకి దిగనున్న ఆసీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: నాగపూర్ టెస్టులో దారుణంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు కోసం మరో కొత్త స్పిన్నర్‌ను తీసుకువస్తోంది. తొలి టెస్టులో ఆడిన ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ రాణించడం తెలిసిందే. ఇప్పుడు ఎడమ చేతి స్పిన్నర్ మాట్ కుహ్నెమన్‌ ను రంగంలోకి దింపనుంది. కుహ్నెమన్ ఇప్పటి దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతని జట్టులోకి తీసుకోవడంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసింది.

"లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ భార్య గర్భవతి. ఆమె కోసం స్వెప్సన్ స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. అతడి స్థానంలో కుహ్నెమన్‌ను ఎంపిక చేశాం. ఈ టెస్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు కుహ్నెమన్ అందుబాటులో ఉంటాడు" అంటూ ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.



Next Story

Most Viewed