ఆసియా గేమ్స్: టెబుల్ టెన్నిస్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన సిస్టర్స్

by Disha Web Desk 2 |
ఆసియా గేమ్స్: టెబుల్ టెన్నిస్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన సిస్టర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియా క్రీడలు-2023లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. ఇవాళ కూడా అదే జోష్‌తో ఆడుతున్నారు. రోలర్‌ స్కేటింగ్‌ విభాగంలో పురుషుల టీమ్, మహిళల టీమ్ పతకాలు సాధించారు. ఉమెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీటర్లలో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్‌, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. మెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీటర్ల రిలే టీమ్‌ ఈవెంట్లో ఆర్యన్‌ పాల్‌, ఆనంద్‌ కుమార్‌, సిద్ధాంత్‌, విక్రమ్‌ కాంస్యం గెలుపొందారు. మరో వైపు ఆసియా క్రీడల్లో భారత్‌కు మొట్టమొదటి పతకం లభించింది. టెబుల్ టెన్నిస్ ఉమెన్స్ డబుల్ విభాగంలో ఆహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ కాంస్య పతకం సాధించి చరిత్ర క్రియేట్ చేశారు.


Next Story